టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా గురించిన ఆసక్తికరమయిన సంగతి ఒకటి హల్ చల్ చేస్తోంది. సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' అంటూ వచ్చిన మహేష్ బాబు తదుపరి చిత్రం గురించి చాలా గ్యాప్ తీసుకున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని ప్రకటించినా ఆ సినిమాను క్యాన్సిల్ చేసి గీతా గోవిందం ఫేం పరశురాం మూవీకి ఫిక్సయ్యాడు మహేష్. తాజాగా 'సర్కార్ వారి పాట' చిత్రంలో నటిస్తున్నట్టు తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా ప్రకటించాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈసినిమాలో మహేష్ బాబుకి విలన్ గా అనేకమంది పేర్లు వినిపించాయి. సునీల్ షెట్టి, ఉపేంద్ర అనుకున్నారు కానీ చివరాఖరికి ఈ మూవీలో నటించబోయేది సుదీప్ అని తెలుస్తోంది. ఈ మూవీలో మహేష్ బాబు ఇంటెలిజెన్స్ అధికారిగా నటించనున్నాడు. బ్యాంకుల నుంచి వేలకోట్లు అప్పుగా తీసుకుని విదేశాలకు చెక్కేసిన మాల్యా, సోక్సీ వంటి వారి ఆస్తుల వేలం వంటి ఆసక్తికరమయిన ఘట్టాలు ఇందులో వుండనున్నాయి. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబరులో ప్రారంభం కానుంది.
లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా షూటింగులు ప్రారంభం అయినా ఈ మూవీకి సంబంధించిన పనులు ఇంకా వేగం పుంజుకోలేదు. ఈ మూవీని వచ్చే ఏడాది ఆగస్టు 9 విడుదల చేస్తారని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లతో రాబోతున్న ఈమూవీ పాన్ ఇండియా తరహాలో వుండనుంది. అయితే ఖర్చు తగ్గించుకోవడానికే నిర్మాణ సంస్థలు ప్రయత్నం చేస్తుండడంతో చిత్ర యూనిట్ అప్ సెట్ అవుతోంది.
పైగా కరోనా కేసులు 5 లక్షలు దాటిపోవడంతో ఇండస్ట్రీలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు కరోనా ప్రభావం పూర్తి స్థాయిలో తగ్గితేగాని షూటింగ్లకు హాజరు కాను అని చెప్పటంతో చిత్రయూనిట్ తల పట్టుకుంటోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆలోచిస్తే ఆగస్టు, సెప్టెంబర్ దాటితే గానీ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం కష్టమే అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa