పవన్ ప్రస్తుతం వరుస బెట్టి సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన హిందీలో సూపర్ హిట్ అయినా పింక్ తెలుగు రీమేక్లో నటిస్తున్నాడు. అక్కడ అమితాబ్ చేసిన పాత్రలో పవన్ కనిపించనున్నాడు. దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ పవన్కు జోడిగా నటించనుంది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. దాదాపు 80 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. పవన్ ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు కూడా ఓకే చెప్పాడు. అందులో క్రిష్ జాగర్లమూడితో వస్తోన్న సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. కొంత షూటింగ్ కూడ జరుపుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషాల్లో విడుదల చేయనుంది చిత్రబృందం.ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి పవన్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరియు ప్రజ్ఞా జైస్వాల్ లు హీరోయిన్ గా నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో పవర్ స్టార్ పక్కన రకుల్ కూడా నటిస్తోందని టాక్ వినిపిస్తోంది.ఇటీవల డైరెక్టర్ క్రిష్ రకుల్ ప్రీత్ సింగ్ ని సంప్రదించారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే క్రిష్ పవర్ స్టార్ మూవీ కోసం అడిగారా లేదా మరేదైనా ప్రాజెక్ట్ కోసం అమ్మడిని అడిగారా అనేది తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa