ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీ లో శర్వానంద్ శ్రీకారం

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 23, 2020, 02:17 PM

కరోనా మహమ్మారి కారణంగా సినిమా థియేటర్లన్నీ మూతపడ్డాయి. షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు కూడా థియేటర్స్ లేకపోవడంతో ఆగిపోయాయి. అయితే కొన్ని సినిమాలు ఓటీటీ వేదిక రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నాచురల్ స్టార్ నాని సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన వి సినిమా ఓటీటీ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. కాగా ఇప్పుడు మరికొంత మంది నిర్మాతలు కూడా దిల్ రాజు అని ఫాలో అవుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం చిత్రం కూడా ఓటీటీ ద్వారా రిలీజ్ కానుందని సమాచారం. నూతన దర్శకుడు కిశోర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించింది. నిజానికి ఈ సినిమా వేసవిలో రిలీజ్ కావాల్సి ఉండగా థియేటర్లు మూతపడడం వల్ల ఆగిపోయింది. ఇక ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితులు కనిపోయించకపోవటంతో నిర్మాతలు డిజిటల్ రిలీజ్ కి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa