ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త బాధ్యతలు స్వీకరించిన సోనూసూద్

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 27, 2021, 01:00 PM

కరోనా కష్టకాలంలో ఎంతో మందికి సాయం చేసిన రియల్ హీరో సోనూసూద్ ఇప్పుడు సరికొత్త బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న 'దేశ్‌ కే మెంటార్స్' కార్యక్రమానికి సోనూసూద్ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని శుక్రవారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్, సోనూసూద్ పాల్గొన్నారు. లాక్‌డౌన్ సమయంలో మేం ఎంతో మందిని కలుసుకున్నాం. అప్పుడే చదువు ఒక పెద్ద సమస్యగా ఉందని అర్థమైంది. పిల్లలకు సరైన మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని గ్రహించాం అని సోనూసూద్ తెలిపారు. ఈ సందర్భంగా సోనూసూద్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. మంచిపని చేయడం కోసం రాజకీయాల్లో చేరాల్సిన అవసరం లేదని, ఇప్పుడు తాను వాటి గురించి ఆలోచించడం లేదని సోనూసూద్ తెలిపారు. కేజ్రీవాల్‌ జీతో జరిగిన సమావేశంలో కూడా పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రస్తావన రాలేదని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa