పెద్ద కుటుంభం నుండి వచ్చిన కూడా, గర్వం లేకుండా తనదైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో మంచు మనోజ్. సమాజంలో జరిగే అన్యాయాలను ప్రశ్నించడంతో ఐనా, భాదిత కుటుంబాలకు తోడుగా నిలబడటం లో ఐనా మనోజ్ ముందు వరసలో ఉంటాడు అనడంలో సందేహం లేదు. కాగా మనోజ్ 2017లో 'ఒక్కడు మిగిలాడు' అనే సినిమాలో కనిపించారు. ఈ క్రమంలో కాస్త విరామం తీసుకున్న మంచు హీరో.. ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమాని చేస్తున్నట్టు తెలిసిందే. మనోజ్ స్వీయ నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ సెట్స్ మీదకు రానుంది.
ఐతే సినీ ఇండస్ట్రీలో వరుసపెట్టి పలువురు ప్రముఖులకు కరోనా సోకుతుండటంతో సినీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ , అర్జున్, వడివేలు, కరీనా కపూర్, ప్రగ్యా జైస్వాల్ వంటి నటీనటులు ఎందరో కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో కొంత మందిని కోల్పోవడం కూడా జరిగింది. ఐతే తాజాగా యంగ్ హీరో మంచు మనోజ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని సోషల్ మీడియా ద్వారా ఆయన వెల్లడించారు. మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, “కోవిడ్ పాజిటివ్ అని తేలింది. గత వారంలో నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ వెంటనే పరీక్షలు చేయించుకుని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నేను తెలియ చేస్తున్నాను. నా గురించి ఆందోళన పడకండి. మీ అందరి ప్రేమ ఆశీర్వాదాలతో నేను పూర్తిగా బాగున్నాను. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాను” అని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇలాంటి మంచి మనిషికి అపాయం కలగకుండా ఉండాలని కోరుకుందాం.