వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో మార్చి 11న థియేటర్లో రిలీజ్ అయ్యిన 'ద కాశ్మీర్ ఫైల్స్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కశ్మీర్ లో సాగే భారత్, పాకిస్థాన్ల మధ్య ఇరుక్కున్న కాశ్మీరీల అంశాలతో ఈ సినిమా వచ్చింది. కేవలం మూడు వారాలలో 'ది కాశ్మీర్ ఫైల్స్' బాక్సాఫీస్ వద్ద 238.28 కోట్లు వసూలు చేసింది. గురువారం నాడు ఈ సినిమా 2 కోట్లకు పైగా వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 250 కోట్ల మార్కును ఈజీగా దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ అండ్ పల్లవి జోషి ముఖ్యమైన పాత్రలు పోషించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa