టాలీవుడ్ మాటల మాంత్రికుడిగా ప్రసిద్ధి చెందారు రైటర్ కం డైరెక్టర్ త్రివిక్రమ్. తన పదునైన సంభాషణలతో, పంచ్ డైలాగులతో హీరోలకు సమానమైన ఫాలోయింగ్ ను, క్రేజ్ ను సంపాదించుకున్నారు. త్రివిక్రమ్ నుండి సినిమా వచ్చి రెండేళ్లు కావొస్తుంది. 2020లో అల్లుఅర్జున్ హీరోగా చేసిన అల వైకుంఠపురంలో సినిమాతోనే త్రివిక్రమ్ చివరిసారిగా ప్రేక్షకులను పలకరించారు. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమాకు డైలాగులను, స్క్రీన్ ప్లే ను అందించారు. భీమ్లానాయక్ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేసినా వెనకుండి మొత్తం నడిపించింది త్రివిక్రమ్ అని అంతా అనుకుంటున్నారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ చేతినిండా ప్రాజెక్టులున్నాయి. మహేష్ బాబుతో #SSMB 28 చిత్రాన్ని డైరెక్ట్ చెయ్యాలి, పవన్ కళ్యాణ్ తో తమిళ్ రీమేక్ వినోదయ సిత్తం కు డైలాగులను రాయాలి. ఇద్దరు పెద్ద స్టార్ల చిత్రాలకు రెండు వేరు వేరు బాధ్యతలను తన భుజాలనెత్తుకున్న త్రివిక్రమ్ మాత్రం ఎలాంటి ప్రెజర్ కు, టెన్షన్ కు లోనుకాకుండా, ఎప్పటిలాగానే చాలా కూల్ గా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఆధునిక దేవుడి రూపంలో నటించబోతున్న వినోదయ సిత్తం లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్ లో నటించబోతున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు సముద్రఖని. ఈ చిత్రానికి డైలాగులను, అడిషనల్ స్క్రీన్ ప్లే ను త్రివిక్రమ్ అందించనున్నారు. ఈ సినిమాకు పని చేస్తూనే మరో పక్క మహేష్ బాబు మూవీని తెరకెక్కించాలి. రెండు కత్తిమీద సాము లాంటి ప్రాజెక్టులే. SVP లాంటి సక్సెస్ తో ఉన్న మహేష్ కు యావరేజ్ హిట్ నైనా త్రివిక్రమ్ ఇవ్వాలి. లేకపోతే, ఈ క్రేజీ కాంబో మీద ప్రేక్షకాభిమానులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలవుతాయి. అలానే, పవన్ చిత్రాలకు అన్ని తానై నడిపిస్తున్న త్రివిక్రమ్ వినోదయ సిత్తానికి కూడా తగిన న్యాయం చెయ్యాలి.
ఇప్పటికే వినోదయ సిత్తం మూవీ కి సంబంధించిన అన్ని పనులను చక్కబెట్టిన త్రివిక్రమ్ ఈ క్రమంలో మహేష్ చిత్ర కధకు తుది మెరుగులు దిద్దుతున్నాడట. ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లే #SSMB 28 మూవీ 120 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే జనవరికల్లా రిలీజ్ కు రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa