MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నితిన్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'మాచర్ల నియోజకవర్గం' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ ఆఫీసర్ (గుంటూరు జిల్లా కలెక్టర్) గా నటిస్తున్నాడు. నితిన్ సరసన ఈ సినిమాలో కృతి శెట్టి అండ్ కేథరిన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 12, 2022న విడుదల కానుంది. తాజాగా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ 'చిల్ మారో' ని ఉలగ నాయగన్ కమల్ హాసన్ ఈరోజు హైదరాబాద్లో జరగనున్న కమల్ హాసన్ 'విక్రమ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో దీనిని లాంచ్ చేయనున్నారు. శ్రేష్ట్ మూవీస్ తెలుగు రాష్ట్రాల్లో 'విక్రమ్' చిత్రాన్ని విడుదల చేయనుంది అని అందరికి తెలిసిన విషయమే. పొలిటికల్ ఎలిమెంట్స్తో పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాని ఆదిత్య మూవీస్తో కలిసి శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa