ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూరి - విజయ్ ల JGM కు కేంద్రం షాక్.. దిక్కుతోచని స్థితిలో పూరి

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 02, 2022, 11:44 AM

పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండల కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా లైగర్. ఆగస్టు 25న విడుదల కాబోతుంది. లైగర్ మూవీ విడుదల కాకముందే పూరి, విజయ్ ల ద్వయం తమ కాంబినేషన్లో తెరకెక్కనున్న మరో పాన్ ఇండియా సినిమాను ప్రకటించి అందరిని ఆశ్చర్యచకితుల్ని చేసారు. ఇటీవలనే ఈ మూవీని అధికారికంగా ఎనౌన్స్ చేసారు. JGM టైటిల్ తో మిలిటరీ నేపధ్యమున్న కథతో తెరకెక్కబోతున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్ ను బట్టే తెలిసిపోతుంది. పూరి డ్రీం ప్రాజెక్ట్ గా చెప్పుకుంటున్న ఈ సినిమాను ముందుగా మహేష్ బాబుతో చేద్దామనుకున్నారు.., చివరికి రౌడీ హీరోతో తెరకెక్కిస్తున్నారు. తాజాగా JGM చిత్రబృందానికి కేంద్రం షాక్ ఇచ్చింది. 


JGM హిందీ వెర్షన్ కు కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారన్న విషయం తెలుసు కదా. అయితే, కరణ్ సోలోగా కాకుండా ఇతర ఇన్వెస్టర్లతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వీరందరి సూచన మేరకు పూరి కొన్ని లీగల్ ఎడ్వైజ్ లను తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో, కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాధ్ సింగ్ ను పూరి బృందం కలుసుకుని, JGM కధకు అప్రూవల్ అడిగారు, ముంబై మహానగరాన్ని మిలిటరీ ఫోర్సులు చుట్టుముట్టే కథ కావడంతో భారతదేశ ప్రభుత్వం, డిఫెన్స్ రెండు కూడా JGM కథను సినిమాగా మార్చేందుకు అంగీకరించలేదు. అనుకోని పరిణామాలతో షాక్ తిన్న పూరి, ప్రస్తుతం JGM కథను ఎలాంటి లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా తయారు చేసే పనిలో ఉన్నారట. కధ ఎప్పుడు సిద్ధమైతే అప్పుడే మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. దీంతో అనుకున్న సమయాని కన్నా JGM స్టార్ట్ అవటానికి సమయం పడుతుంది. ఈ సమయాన్ని వృధా చెయ్యకుండా విజయ్ ఖుషి సినిమా చేసేందుకు ఒప్పుకున్నారని తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa