ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సల్మాన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం పటిష్ట భద్రత

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 06, 2022, 02:10 PM

పంజాబీ సింగర్ కమ్ పొలిటీషియన్ సిద్ధూ మూసే వాలా ను ఎవరో గుర్తు తెలియని దుండగులు ఇటీవలే కాల్చి చంపిన విషయం బాలీవుడ్ లో సంచలనం రేపింది. ఇతన్ని కాల్చి చంపింది లారెన్స్ బిష్ణోయ్ అని పోలీసులు ప్రైమ్ సస్పెక్టు చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో బిష్ణోయ్ నుండి బెదిరింపులనెదుర్కొన్న సల్మాన్ ప్రాణాలకు హాని పొంచి ఉందని భావించిన పోలీసులు సల్మాన్ సెక్యూరిటీని పెంచారు. అతని అపార్టుమెంటు చుట్టూరా పోలీసుల నిఘా ఉంచారు.


ఇదిలాఉంటే తాజాగా సల్మాన్ ఖాన్ కు పటిష్ట భద్రతను ప్రకటిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసే వాలా లాగానే సల్మాన్ ను, అతని తండ్రిని త్వరలోనే చంపేస్తామని పేర్కొంటూ గుర్తు తెలియని వ్యక్తులు సల్మాన్ కు లేఖ పంపించారు. ఈ లేఖను సల్మాన్ వాకింగ్ చేసే ప్రదేశంలో అగంతకులు పడేసారు. సల్మాన్ కంట పడిన ఈ లేఖను ముంబై పోలీసులకు తన బాడీగార్డ్స్ ద్వారా తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa