ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రేజీ హీరోయిన్ రష్మిక మండన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. గతేడాది విడుదలైన ఈ సినిమా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉత్తరాదిన పుష్ప సినిమా ఒక సంచలనం. అల్లు అర్జున్ మాస్ యాక్టింగ్, ఆయన మ్యానరిజం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సుకుమార్ టేకింగ్ ఈ సినిమాని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టాయి. వీటికే ఉత్తరాది ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఎక్కడ చుసిన పుష్ప డైలాగ్స్, పాటలతో హోరెత్తిపోతోంది. పుష్ప డైలాగ్స్, పాటలకు జనాలు రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడప్పుడే పుష్ప ఫీవర్ పోయేటట్లు కనిపించట్లేదు. పలువురు సినీ ప్రముఖులు, కొంతమంది క్రికెటర్లు కూడా పుష్ప మ్యానరిజమ్, స్టెప్పులతో సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు లైగర్ భామ అనన్యా పాండే సామి పాటకు స్టెప్పులేసి తనదైన స్టైల్ లో అదరగొట్టేసింది. ప్రస్తుతం ఈ భామ IIFA వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్ళింది. ఈవెంట్ అనంతరం హోటల్ రూమ్ కి తిరిగొచ్చిన అనన్య పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు స్టెప్పులేసింది.అంతే కాకుండా పుష్ప సిగ్నేచర్ మూవ్ మెంట్ రీక్రియేట్ చేసింది. ఈ వీడియోను హీరోయిన్ సారా అలీఖాన్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేసింది. ఆ తర్వాత ఆ వీడియోను రష్మిక మండన్నా రీపోస్ట్ చేసింది. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో తెగ వైరలవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa