వేణు ఊడుగుల దర్శకత్వంలో టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి 'విరాట పర్వం' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ పీరియాడికల్ డ్రామాలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. రానా అభిమానులు అండ్ సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విరాట పర్వం సినిమా జూన్ 17, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మూవీ మేకర్స్ విరాట పర్వం సినిమా ట్రైలర్ను ఆవిష్కరించారు. తాజాగా ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కరణ్ జోహార్ ట్విట్టర్లో రానా దగ్గుబాటి నటించిన 'విరాట పర్వం' ట్రైలర్పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ట్రైలర్ చాల అద్భుతంగా ఉంది అని సినిమా చూడటానికి ఎదురుచూస్తున్నట్లు అంతేకాకుండా తాను సాయిపల్లవికి పెద్ద అభిమానిని అంటూ ట్వీట్ చేసారు. ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, ఈశ్వరీ రావు, రవి ఆనంద్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.