ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీరు నచ్చక ఆ డైరెక్టర్ ని పక్కన పెట్టేసిన రవితేజ... మరి అతనితో చేస్తున్న సినిమా మాటేమిటి?

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 01:46 PM

గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేసిన క్రాక్ సినిమాతో రవితేజ అప్పటి వరకు తనను పట్టిపీడిస్తున్న అపజయాల నుండి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. క్రాక్ విజయాన్ని ఖిలాడీ తో కొనసాగించాలనుకున్న రవితేజ ఆశలు అడియాసలే అయ్యాయి. ఖిలాడీ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో ఈసారి ఎలా అయినా హిట్ కొట్టి తీరాలని రామారావు ఆన్ డ్యూటీ, ధమాఖా, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలపై రవితేజ పూర్తి ఫోకస్ పెట్టాడు. 


కొత్త దర్శకుడు శరత్ మండవ డైరెక్షన్లో రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాను చేస్తున్నారు.  ఈ చిత్రంలో మజిలీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటున్న ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా జూన్ 17న విడుదల కావాల్సివుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతుండటం వలన సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఇందుకు ప్రధాన కారణంగా డైరెక్టర్ శరత్ పేరు వినబడుతుంది. రషెస్ చూసిన రవితేజ కొన్ని సీన్లను రీషూట్ చేస్తే బావుంటుందని చెప్పాడట. దీంతో ఒక వారం రోజులపాటు రీషూట్ జరుపుకున్న ఈ సినిమా ఫైనల్ ఔట్ పుట్ ను చూసిన రవితేజకు శరత్ మండవ టేకింగ్ నచ్చలేదట. ఫైనల్ ఎడిషన్ తో తీవ్ర అసంతృప్తికి గురైన రవితేజ రామారావు ఆన్ డ్యూటీ కి దూరంగా ఉంటూ వస్తున్నాడట. తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు టైగర్ నాగేశ్వరరావు పై దృష్టి సారించాడట. మరి కోట్లు ఇన్వెస్ట్ చేసి ఈ సినిమాను నిర్మించిన మేకర్స్ మాటేమిటి? రామారావు ఆన్ డ్యూటీ పై ఫ్యాన్స్ కు అధికారికంగా క్లారిటీ ఇచ్చేది ఎవరు? తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చెయ్యాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa