అడవి శేష్ - శశి కిరణ్ తిక్కా కాంబినేషన్ లో వచ్చిన గూఢచారి సినిమాను చూసి ఇంప్రెస్ ఐన చాయ్ బిస్కట్ ఫిలిం ప్రొడక్షన్ సంస్థ యజమానులు అనురాగ్, శరత్ మేజర్ మూవీ కి సహనిర్మాతలుగా వ్యవహరించారు. అడవి శేష్ - శశికిరణ్ తిక్కా కాంబోలో వచ్చిన రెండో సినిమా మేజర్. GMB ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్ సంస్థలతో కలిసి అనురాగ్, శరత్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన మేజర్ మూవీకి దేశవ్యాప్తంగా ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా చూసిన ప్రతి ఒక్కరు మేజర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నిర్మాతలు అనురాగ్, శరత్ మీడియాతో ఇంటిరాక్ట్ అయ్యారు. గూఢచారి చూసి ఇంప్రెస్ అయ్యి శేష్ తో మేజర్ సినిమాను నిర్మించినట్టు తెలిపారు. మహేష్ బాబు భార్య నమ్రత గారితో తమకు ముందు నుంచి పరిచయం ఉందని, మేజర్ నిర్మాణ సంస్థల్లో ఒకటైన సోని పిక్చర్స్ సంస్థ వ్యక్తులను తమకు పరిచయం చేసింది నమ్రతేనని చెప్పారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులతో తమ అనుబంధాన్ని కూడా మీడియాతో షేర్ చేసుకున్నారు. మేజర్ రిలీజ్ కు ముందు జరిగిన ప్రతి ప్రీమియర్ షో కు వారు హాజరయ్యారని, మేజర్ వారికెంతో నచ్చిందని, చనిపోయిన కొడుకుని ఈ సినిమాతో మరోసారి వారికీ చూపించగలిగామని, ఇంతకన్నా వారికిచ్చే బహుమతి మరొకటుండదని పేర్కొన్నారు. చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాటలోకి అడుగు పెట్టిన మేజర్ కలెక్షన్లపై అనురాగ్, శరత్ తమ స్పందనను తెలియచేసారు. నిర్మాతలుగా సినిమాకు ఎక్కువ కలెక్షన్లు రావాలని అందుకు తగ్గట్టుగా ముందే లెక్కలేసుకుంటాం. కానీ ఈ సినిమాకు మాకు కలెక్షన్లు ముఖ్యం కాదు. ప్రతి భారతీయుడిని ధియేటర్ కు రప్పించి మేజర్ మూవీని చూసేలా చెయ్యాలి. అందుకోసం మేజర్ మూవీ లాస్ట్ ధియేటర్ నుండి తొలగించేంత వరకు ప్రమోషన్స్ చేస్తూనే ఉంటాం... అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa