టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీతో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ మూవీకి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు. ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవికి సోదరుడిగా టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇప్పటికే మొదలైందని, చిరంజీవి కూడా ఈ సినిమా సెట్స్లోకి జాయిన్ అయ్యినట్లు సమాచారం. చిరుతో పాటు మరికొందరికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు లేటెస్ట్ టాక్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బాబీ సింహా పవర్ఫుల్ విలన్గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో బ్యాంక్రోల్ చేసింది.