ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ప్రస్తుతం "చోర్ బజార్" అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆకాష్ సరాసన గెహ్నా సిప్పీ నటించింది. "ఈరోజు", "నిరీక్షణ", "లేడీస్ టైలర్" వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి అర్చన ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం జూన్ 24, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. విఎస్ రాజు నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్కు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa