డాన్స్ మాస్టర్ ప్రభుదేవా హీరోగా నటించిన సినిమా 'మై డియర్ భూతం'. ఈ సినిమాకి ఎన్. రాఘవన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుండి 'మాస్టర్ ఓ మై మాస్టర్' అనే పాటను విడుదల చేశారు చిత్ర బృందం. ఈ పాటలో ప్రభుదేవా డ్యాన్స్ హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాకి డి.ఇమాన్ సంగీతం అందించారు.ఈ సినిమాలో రమ్య నంబీసన్, సంయుక్త, ఇమ్మాన్ అన్నాచ్చి, సురేష్ మీనన్ కీలక పాత్రలోనటించారు. ఈ సినిమాని అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్పై రమేష్ పి పిళ్ళై నిర్మించారు.