కోలీవుడ్ సినిమాలలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' ప్రాజెక్ట్ ఒకటి. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండగా రెండు భాగాలుగా రూపొందుతోంది అని సమాచారం. పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 సెప్టెంబర్ 30, 2022న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ స్టార్-స్టడెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ఆడియో రైట్స్ ని టిప్స్ అఫీషియల్ సొంతం చేసుకున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ భారీ బడ్జెట్ పీరియడ్ మూవీలో కార్తీ, విక్రమ్, జయం రవి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ని అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.