ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్-త్రివిక్రమ్ సినిమా గురించిన లేటెస్ట్ అప్‌డేట్‌

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 09, 2022, 03:15 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి టెంపరరీగా 'SSMB28' అని టైటిల్ పెట్టారు. మహేష్ సరసన పూజా హెడ్గే నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి ఒక క్రేజీ అప్‌డేట్‌ని విడుదల చేసారు. మూవీ మేకర్స్ ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఆగస్ట్ నుండి కిక్ స్టార్ట్ అవుతుంది అని అంతేకాకుండా 2023 సమ్మర్ లో సినిమా రిలీజ్ అవుతుంది అని మేకర్స్ వెల్లడించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa