కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ద్విభాషా చిత్రం "వారసుడు". తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మేజర్ షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుండి త్వరలోనే ఫస్ట్ లిరికల్ కు సంబంధించిన అప్డేట్ రావొచ్చని అంటున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణమే నటిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.