ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నయనతారని తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ప్రశ్నించనుందా..??

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 10, 2022, 06:58 PM

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార నిన్ననే వార్తల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన విషయం తెలిసిందే. నయనతార భర్త, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తమ దంపతులకు ట్విన్ బేబీ బాయ్స్ జన్మించారని పేర్కొంటూ, ప్రేక్షకాభిమానుల ఆశీస్సులను కోరుతూ, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ మేరకు విఘ్నేష్ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. ఈ ఫొటోస్ లో నయన్, విక్కీ దంపతులు తమ చిన్నారుల లేలేత పాదాలను ముద్దాడుతూ కనిపిస్తారు.


ఐతే, నయన్ విక్కీ దంపతులు తాజాగా కాంట్రవర్సీలో ఇరుక్కున్నట్టు తెలుస్తుంది. జూన్ 9వ తేదీన పెళ్ళైన వీరిద్దరూ అక్టోబర్ 9వ తేదీన పేరెంట్స్ అయ్యామంటూ ప్రకటించడంతో, సరోగసి టాపిక్ బయటకు వచ్చింది. సరోగసి విధానంలో బిడ్డను కనాలనుకుంటున్నాం అని ఎప్పుడూ నయన్ విక్కీ దంపతులు చెప్పింది లేదు. దీంతో తమిళనాడు ప్రభుత్వం సరోగసి కి సంబంధించిన లీగల్ ప్రొసీజర్ ను ఫాలో అయ్యారో లేదో తెలుసుకునేందుకు త్వరలోనే నయన్, విఘ్నేష్ లను ప్రశ్నించాలని అనుకుంటుందట. ఈ విషయంలో మరింత క్లారిటీ రావలసి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa