పెంచలయ్యగా సునీల్ ను, మైసూరు బుజ్జిగా వెన్నెల కిషోర్ ను ప్రేక్షకులకు పరిచయం చేసిన "జిన్నా" చిత్రబృందం తాజాగా సీనియర్ కమెడియన్ రఘుబాబును 'రంగంపేట ప్రెసిడెంట్ తిప్పే స్వామి' గా పేర్కొంటూ, ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇప్పటివరకు విడుదల చేసిన ఈ మూడు పాత్రలు కూడా సినిమాలో కడుపుబ్బా నవ్వించే సీన్లలో మెయిన్ క్యారెక్టర్స్ అని తెలుస్తుంది.
మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.
ఇషాన్ సూర్య డైరెక్షన్లో హార్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.