ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నయనతార - విఘ్నేష్ శివన్ ల సరోగసి పై కమిటీ వేసిన తమిళనాడు ప్రభుత్వం

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 13, 2022, 06:50 PM

ఎప్పుడైతే, నయనతార - విఘ్నేష్ శివన్ లు పేరెంట్స్ అయ్యామంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారో, ఇక అప్పటి నుండి ఆ టాపిక్ వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తూ వస్తుంది.


పెళ్ళైన నాలుగు నెలలకే నయన్ తల్లి కావడం, అది సరోగసీ ద్వారానే అయ్యుంటుందని తేలడం, ఇండియాలో సరొగసీని బ్యాన్ చేసినప్పటికీ నయన్ ఎలా సరోగసి విధానాన్ని ఆప్ట్ చేసిందని, ఒకవేళ చేసినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ ప్రొసీజర్ జరిగిందా... ఇలా పలు రకాలుగా నయన్ విపరీతమైన కాంట్రవర్సీ ఎదుర్కోవలసి వస్తుంది.


తాజాగా తమిళనాడు హెల్త్ కేర్ మినిస్ట్రీ నయన్ సరోగసి పై ముగ్గురు సభ్యుల కమిటీని వేసింది. ఇన్వెస్టిగేషన్ కోసం ఏ సమయంలోనైనా నయన్, విఘ్నేష్ లు కమిటీ ముందు హాజరు కావలసి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa