నందమూరి బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో ఒక మూవీ షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇటీవలే టర్కీ లో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని వచ్చిన చిత్రబృందం తాజాగా రేపటి నుండి హైదరాబాద్ మొయినాబాద్ లో NBK 107 లాస్ట్ షెడ్యూల్ ను మొదలెట్టనున్నారట. ఈ షెడ్యూల్ లో బాలయ్య, శృతి లపై మాస్సివ్ సీన్స్ ను చిత్రీకరించబోతున్నారట.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ విడుదలకు రెడీ అవుతుందని టాక్ నడుస్తుంది. ఐతే, ఈ విషయంపై మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa