రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో... వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ‘దగా..కుట్ర’ అనే పాటపై ఇప్పటికే తెలుదుగేదశ పార్టీ భగ్గుమంటోంది. టిడిపి కార్యకర్తలు వర్మ ఫోటోలకు శవయాత్రలు జరిపి, దిష్టిబొమ్మలను తగల బెడుతున్నారు కూడా ఈ క్రమంలోనే తమ ముఖ్యమంత్రిని కించపరుస్తూ దర్శకుడు రామ్గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలోని ‘దగా..కుట్ర’ పాటను వెంటనే బ్యాన్ చేసేలా సెన్సార్ బోర్డుకు ఆదేశాలివ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు పిఠాపురం ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ తెలిపారు.
రామ్గోపాల్ వర్మ ఓ ఉన్మాది గా మారిపోయారని, పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తూ , పదే పదే వివాదాలు సృష్టించడం ఆయన నైజంగా మారిపోయిందని, ప్రాంతీయ, కుల విభేదాలు కల్పించి ఓట్లు దండుకుని అధికారంలోకి రావాలని చూస్తున్న వైసీపీ నేతలు ఇప్పుడు రామ్గోపాల్ వర్మకు తోడయ్యారని విమర్శించారు, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిర్మాత రాకేష్రెడ్డి... వైసీపీ యువజన నాయకుడని, ఆయనని ప్రత్యక్షంగా ఉంచి వైసీపీ నేతలే చిత్రానికి ప్రధాన పెట్టుబడి దారులని, ఈ సినిమా వెనక వైసీపీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీని గందరగోళంలోకి నెట్టి తన హస్తగతం చేసుకోవాలని ఓ వ్యక్తి చూస్తే, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటానికి చంద్రబాబు తగిన తీసుకున్నారని, దీనికి తదుపరి ఎన్నికలలో ప్రజలు సైతం తమ ఆమోద ముద్ర వేసి చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకే అధికారం కట్టబెట్టారు కానీ ఇతరులు చెప్పుకున్న తెలుగుదేశం పార్టీలకు కాదని వర్మ గుర్తెరగాలని అన్నరు.
కానీ జనం తీర్పుని గౌరవించని వ్యక్తుల కోణంలోంచి సినిమా అంటూ నాటి ఘటనలను నేటి తరానికి తప్పుగా చూపించేందుకు వర్మ నడుం బిగించారని, ఇలా ముఖ్యమంత్రిపై దుష్ప్రచారం చేయడం సమంజసం కాదని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. రామ్గోపాల్ వర్మ సినిమా విడుదలను అడ్డుకుంటామన్నారు. తక్షణమే నిర్మాత రాకేష్రెడ్డి, దర్శకత్వం వహిస్తున్న రామ్గోపాల్ వర్మను అరెస్టు చేయాలని లేని పక్షంలో రాష్ట్రంలో అలజడులు రేకెత్తించే ప్రమాదం కూడా ఉందని ఎస్విఎస్ఎసన్ వర్మ ఆందోళన వ్యక్తం చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa