టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీతో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ మూవీకి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు. ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, చిరంజీవి మరియు రవితేజలపై మాస్ సాంగ్ ని షూట్ చేసినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. దేవి శ్రీ ప్రసాద్ వీరిద్దరికి ఎనర్జీ మాస్ సాంగ్ ని ట్యూన్ చేయగా, శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేశారు.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బాబీ సింహా పవర్ఫుల్ విలన్గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.