పా.కిన్స్లిన్ దర్శకత్వంలో కోలీవుడ్ లో గ్లామర్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'డ్రైవర్ జమున' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. నవంబర్ 11, 2022న థియేటర్లలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడగా, నవంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది అని సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా మూవీ మేకర్స్ నుండి రావాల్సి ఉంది.
ఆడుకలం నరేన్, కవితా భారతి, అభిషేక్ కుమార్, ఇళయ పాండి, మణికందన్ రాజేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. మహిళా క్యాబ్ డ్రైవర్ రోజున జరిగే సంఘటనల చుట్టూ ఈ సినిమా వెళ్తుంది అని సమాచారం. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు. 18 రీల్స్పై ఎస్.పి.చౌదరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.