ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి సాయంత్రం ‘మహర్షి’నుంచి సప్రైజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 31, 2018, 01:03 PM

అభిమానులకు మహేశ్ బాబు న్యూ ఇయర్ కానుక ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. వివరాల్లోకి వెళ్లితే..మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 25వ సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో అల్లరి నరేశ్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.


మహర్షి’ మూవీలో మహేశ్ మరో సారి కోటీశ్వరుడి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ మూవీలో మహేష్ బాబు విద్యార్థిగా..ఎన్‌ఆర్ఐగా రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. రీసెంట్‌గా రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన  విలేజ్ సెట్స్‌లో రైతు సమస్యలపై కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ షెడ్యూల్ కంప్లీటైంది. ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్‌ను సంక్రాంతి తర్వాతి ప్లాన్ చేస్తున్నారు.


తాజాగా ఈ మూవీ యూనిట్ కొత్త సంవత్సర కానుకగా ఈ మూవీలోని రెండో పోస్టర్‌ను ఈరోజు సాయంత్రం 6.03 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ న్యూ ఇయర్‌ని రిషి, అతని ప్రయాణంతో సెలబ్రేట్ చేసుకోండి అంటూ వంశీ ట్వీట్ చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa