మరో రెండురోజుల్లో థియేటర్లకు రాబోతున్న సినిమా "పంచతంత్రం". ఈ సినిమాతోనే కలర్స్ స్వాతి చాన్నాళ్ల తరవాత వెండితెరపై మెరవవుతుంది. అలానే సినిమాలలో కనిపించడం మానేసిన హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గారు కూడా ఈ సినిమాతోనే ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించబోతున్నారు.
విడుదల తేదీ దగ్గర పడడంతో పంచతంత్రం మూవీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సిద్ధమైంది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం రామోజీ ఫిలింసిటీలో పంచతంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్లు హరీష్ శంకర్ గారు, అనిల్ రావిపూడి గారు చీఫ్ గెస్ట్ లుగా హాజరు కానున్నారు.
ఈ సినిమాకు హర్ష పులిపాక డైరెక్టర్ కాగా, టికెట్ ఫ్యాక్టరీ, S ఒరిగినల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa