ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ మరణానికి కారకులు ఆయన కుటుంబ సభ్యులే: నాదెండ్ల

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 24, 2019, 11:00 AM

తొలిరోజు 2-3 కోట్ల రూపాయలు రాబడుతున్న ఈ కాలంలో ‘మహానాయకుడు’ ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.కోటి మాత్రమే వసూలు చేయడంపై చిత్ర యూనిట్ షాక్‌కు గురైంది. వర్మ డిజాస్టర్ మూవీ ‘ఆఫీసర్’ తొలిరోజు ఇంతకంటే ఎక్కువే రాబట్టినట్లు ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ‘కథానాయకుడు’ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడం యూనిట్‌ను నిరాశపరిచింది. దీంతో ‘మహానాయకుడు’ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన క్రిష్, బాలయ్య.. ఎన్నో అంచనాలతో విడుదల చేశారు. అయితే ఫలితం మాత్రం మారలేదు.

అదంతా అల ఉంచితే ఈ సినిమాలో ఒకప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావును చూపించారు.తాజాగా తనను విలన్ గా చూపించడంపై నాదెండ్ల భాస్కర్ రావు స్పందించారు. ఆయన సినిమా చూడనప్పటికీ.. చూసిన వాల్లు చెప్పడంతో దీనిపై మాట్లాడారు.ఎన్టీఆర్ వారసులు తీసిన ఈ సినిమా విషయంలో అంతకన్నా ఎక్కువ ఆశించడానికి ఏముంటుందని నాదెండ్ల ఆవేదన వ్యక్తం చేశారు. అసలు విలన్ చంద్రబాబు నాయుడే అని కుండబద్దలు కొట్టారు. 



తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకొమ్మని చంద్రబాబు నాయుడే తన వద్దకు ఒకప్పుడు వచ్చాడని నాదెండ్ల భాస్కర్ రావు చెప్పారు. సినిమాలతో నిజాలను మార్చలేరని.. ఎన్టీఆర్ మరణానికి కారకులు ఆయన కుటుంబ సభ్యులేనని.. ఎన్టీఆర్ ను తీవ్రంగా క్షోభ పెట్టింది వారేనని నాదెండ్ల సంచలన కామెంట్స్ చేశారు.

ఆయన తన తిండి అవసరాల కోసం కొంత సొమ్ముపెట్టుకుంటే.. దానిపై కూడా కోర్టుకు వెళ్లి.. ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా చేసి హింసించారని వారసులపై నాదెండ్ల నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ కు లక్ష్మీ పార్వతి సపర్యలు చేసిందని.. ఆయన గెలిచాక.. ఆయన చుట్టూ చేరారు అని.. ఎన్టీఆర్ కు ఆయన వారసులే తీవ్రంగా ఇబ్బంది పెట్టారని నాదెండ్ల చెప్పుకొచ్చారు. తనను విలన్ గా చూపించడంపై నోటీసులు పంపించినట్టు నాదెండ్ల తెలిపారు. అధికారంలో ఉండడంతో వారిని ఎవరూ ఏం చేయడం లేదని.. కానీ ప్రతిఫలం అనుభవిస్తారని నాదెండ్ల హెచ్చరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa