మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సినిమాకు బాణీలు చేకురుస్తుండగా, శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఆయన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది. అయితే ఇప్పుడు విజయ్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘ఉప్పెన’ షూటింగ్ పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో డేట్స్ కుదరకపోవడంతో విజయ్ వైదొలిగినట్లు సమాచారం. దీంతో ప్రతినాయకుడి పాత్రకు సరిపోయే మరో నటుడ్ని ఎంచుకోవడానికి యూనిట్ ప్రయత్నిస్తోందట. మరి ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. విజయ్ తెలుగులో నేరుగా నటిస్తున్న తొలి సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ప్రస్తుతం ఆయన పలు తమిళ సినిమాల షూటింగ్లతో చాలా బిజీగా గడుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa