రాడార్ స్టేషన్కు ఎందుకు అనుమతిచ్చారో కేసీఆర్ను నిలదీయాలి.. బండి సంజయ్
Tue, Oct 15, 2024, 06:43 PM
by Suryaa Desk | Wed, Oct 16, 2024, 10:41 PM
ప్రభుత్వం అందించే ఉచిత టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారిణి శ్వేత అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వైద్యాధికారిని మాట్లాడుతూ.. పాడి రైతులకు అధిక నష్టం చేకూర్చే గాలికుంటు వ్యాధిపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండల వ్యాప్తంగా వేస్తున్న గాలికుంటు నివారణ టీకాలను రైతులు విధిగా వేయించుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమం నెల రోజులపాటు కొనసాగుతుందన్నారు. గ్రామంలో 8 తెల్ల, 30 నల్ల పశువులకు టీకాలను వేశామన్నారు. ఈ కార్యక్రమంలో విఏ శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.