రాడార్ స్టేషన్కు ఎందుకు అనుమతిచ్చారో కేసీఆర్ను నిలదీయాలి.. బండి సంజయ్
Tue, Oct 15, 2024, 06:43 PM
by Suryaa Desk | Thu, Oct 17, 2024, 02:56 PM
మరో ఉద్యమానికి మాదిగ, ఉపకులాలు సిద్ధంగా ఉండాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. HYDలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'ఎస్సీ వర్గీకరణ అమలులో ఎందుకు జాప్యం చేస్తున్నారు? మాదిగలపై రేవంత్వి తేనె పూసిన మాటలు. నమ్మించడంలో ఘనుడు.. మోసం చేయడంలో అంతకన్నా పెద్ద ఘనుడే. వర్గీకరణ అంశంపై సీఎం తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. ముందు అమలుచేస్తామన్న రేవంత్ మాటలకు విలువ లేకుండాపోయింది' అని విమర్శించారు.