by Suryaa Desk | Thu, Oct 17, 2024, 10:27 AM
గోల్డ్ లవర్స్కి వరుస షాకులు తగుతున్నాయ్. తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు.. ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గడిచిన ఒక్క రోజులో ఏకంగా 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.460 మేరకు పెరగగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు తులనికి రూ. 500 పెరిగాయి. అటు వెండి ధర కూడా కిలోపై రూ. 200 మేరకు పెరిగింది. గురువారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
22 క్యారెట్ల బంగారం ధరలు:
ముంబై - రూ.71,410
కోల్కతా - రూ.71,410
ఢిల్లీ - రూ.71,560
చెన్నై - రూ.71,410
హైదరాబాద్ - రూ.71,410
విజయవాడ - రూ.71,410
బెంగళూరు - రూ.71,410
24 క్యారెట్ల బంగారం ధరలు:
బెంగళూరు - రూ.77,900
ముంబై - రూ.77,900
కోల్కతా - రూ.77,900
హైదరాబాద్ - రూ.77,900
విజయవాడ - రూ.77,900
ఢిల్లీ - రూ.78,050
చెన్నై - రూ.77,900
వెండి ధరలు ఇలా..బంగారం ధరలు బాటలోనే వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 97 వేల మార్కు వద్దకు చేరింది. అంతకుముందు రెండు రోజుల్లో రూ. 200 మేర ఎగబాకింది. ఇదే సమయంలో హైదరాబాద్లో కిలో వెండి ప్రస్తుతం రూ. 1,02,800 వద్ద ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో కూడా ఇదే ధర కొనసాగుతోంది. బంగారం, వెండి రేట్లు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి. స్థానికంగా ఉండే పన్ను రేట్లు.. ఈ ధరల్ని ప్రభావితం చేస్తుంటాయి.