అన్నం విషయంలో జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణం మీదకు వచ్చింది. గదిలో అన్నం వండలేదని ఓ వ్యక్తిని అతడి స్నేహితులే చంపేశారు. విచక్షణారిహితంగా కొట్టడంతో స్పాట్లోనే మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి.. బిహార్కు చెందిన బినయ్సింగ్, సోనుతివారీ, యూపీకి చెందిన సందీప్ కుమార్ జీడిమెట్ల పరిధి అయోధ్యనగర్లో ఓ గదిలో రెంట్కు ఉంటున్నారు. స్థానికంగా ఓ గ్రానైట్ వ్యాపారి వద్ద పని చేస్తున్నారు.
అయితే రాజస్థాన్కు చెందిన హన్స్రామ్ (38) వీరికి స్నేహితుడు. అతడు భార్యాపిల్లలతో కలిసి కుత్బుల్లాపూర్లోని అద్దె ఇంట్లో ఉండేవాడు. హన్స్రామ్ మద్యం తాగి నిత్యం భార్యను వేధించేవాడు. అతడు వేధింపులు తట్టుకోలేక రెండు నెలల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో హన్స్రామ్ కుత్బుల్లాపూర్లోని గదిని ఖాళీ చేసి బినయ్సింగ్ గదికి మకాం మార్చాడు. మంగళవారం రాత్రి సందీప్ కుమార్, సోను తివారీలు మద్యం తాగి గదికి వచ్చారు.
అన్నం ఎందుకు వండలేదని ముందుగా బినయ్సింగ్ను కొట్టడంతో అతడు బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత హన్స్రామ్ను ఇద్దరూ కలిసి విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటనలో హన్స్రామ్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బినయ్ సింగ్ జరిగిన విషయాన్ని వ్యాపారికి చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అన్నం వండకపోతే మాత్రం కొట్టి చంపుతారా..? మరీ ఇంత వైలెంట్గా ఉన్నారేంట్రా అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa