ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నన్ను చంపేస్తామంటున్నారు.. నేను అంతా ఈజీగా చచ్చేవాన్ని కాదు: అసదుద్దీన్ ఒవైసీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 07, 2024, 06:01 PM

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఓవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ ముక్తార్ అన్సారీ యూపీలోని ఓ జైలులో శిక్ష అనుభవిస్తూ ఇటీవల మృతి చెందగా.. అతని మరణంపై అసదుద్దీన్ ఓవైసీ సంతాపం ప్రకటించారు. ఈ క్రమంలోనే.. అన్సారీ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లే యోచనలో కూడా ఉన్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ తెలిపారు అసదుద్దీన్ ఓవైసీ. ముక్తార్ అన్సారీ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తే.. తనను చంపేస్తామంటూ కొందరు సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చారు.


కానీ.. తాను అంత ఆశామాషీగా చచ్చేవాడిని కాదని అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకేమైనా జరిగితే తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు అసదుద్ధీన్. దీంతో.. అసదుద్ధీన్ ఒవైసీ వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉంటే.. ఈ విషయంపై హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత కౌంటర్ వేశారు. ఆరు హత్యలు చేసిన ముక్తారీ అన్సారీ ఇంటికి అసదుద్దీన్ ఓవైసీ ఎలా వెళ్తారని మాధవీలత ప్రశ్నించారు. అలా అయితే.. హైదరాబాద్‌లో చనిపోయిన వారి కుటుంబాలను ఓవైసీ ఎందుకు పరామర్శించట్లేదని నిలదీశారు. సోషల్ మీడియా బెదిరింపులకే అసదుద్ధీన్ ఒవైసీ భయపడిపోతున్నారంటూ మాధవీలత ఎద్దేవా చేశారు.


తాను ఓవైసీకి వ్యతిరేంగా.. ధైర్యంగా మాట్లాడటంతోనే.. బీజేపీ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వంతో చెప్పి వై కేటగిరీ భద్రత ఇప్పించారని మాధవీలత స్పష్టం చేశారు. ఎన్నికల్లో తన ప్రధాన ప్రత్యర్థి అసదుద్దీన్ ఓవైసీనే అని స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. ముక్తారీ అన్సారీ మరణంపై ఒవైసీ, మాధవీలత మధ్య జరుగుతున్న మాటల యుద్ధం హైదరాబాద్ పార్లమెంట్ రాజకీయాల్లో వేడి రగులుస్తున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa