హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల రద్దీని బట్టీ ట్రైన్లను నడుపుతోన్న సంగతి తెలిసిందే. రద్దీ ఎక్కువగా ఉంటే నిమిషానికి 3, 4, 6, 8 నిమిషాల చొప్పున ట్రైన్లు నడుపుతున్నారు. క్షణాల వ్యవధిలోనే మెట్రో వెళ్లపోయినా.. ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సిన పని లేకుండా వెంటనే మరో మెట్రో అందుబాటులోకి వస్తుంది. ఇదే తరహాలో.. బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
మెట్రో లేని మార్గాల్లో సమయాలను నిర్దేశించి వాటికి అనుగుణంగా బస్సులు నడపాలని అధికారులు డిసైడ్ అయ్యారు. ప్రస్తుతంసికింద్రాబాద్- మణికొండ మార్గాన్ని ప్రయోగాత్మకంగా ఎంచుకుని 47L పేరుతో సిటీ బస్సులు రన్ చేస్తున్నారు. 222L (లింగంపల్లి టూ కోఠి) బస్సులకు సైతం టైం స్లాట్స్ పెట్టారు. ఈ రెండు రూట్లలో ప్రయాణికుల ఆదరణను దృష్టిలో పెట్టుకుని 10 నిమిషాలకో బస్సు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
సికింద్రాబాద్- మణికొండ మధ్య నడిచే 47ఎల్ బస్సు ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్ నుంచి మొదటి బస్సు బయలుదేరుతుంది. మణికొండ నుంచి ఇదే బస్సు ఉదయం 5.15కు స్టార్ట్ అవుతుంది. ఇలా రాత్రి 10 గంటలకు చివరి బస్సు సికింద్రాబాద్- మణికొండకు రాత్రి 11.15కు చేరుకుని తిరిగి సికింద్రాబాద్కు పయనమవుతోంది. కోఠి- లింగంపల్లి మధ్య సైతం 222L రూటు బస్సులు వేకువజాము నుంచి రాత్రి 11 గంటల వరకూ ప్రతి 20 నిమిషాలకో బస్సు ఉండేలా చర్యలు తీసుకుటున్నారు. ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉంటే టైం తగ్గించి బస్సుల సంఖ్య పెంచుతామని అన్నారు. ప్రయాణికులు టెన్షన్ పడాల్సిన పనిలేదని సిటీలో తగినన్ని బస్సులు నడుపుతామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa