ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 18, 2024, 10:20 PM

తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన అన్నదాతల కోసం పంట బీమా పథకం అమలు చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుతం.. అమలు దిశగా మరో అడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ పంట బీమా పథకాన్ని వచ్చే వానా కాలం సీజన్ నుంచే మొదలు పెట్టబోతున్నట్లు తాజాగా మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. అయితే.. రైతులపై భారం పడనివ్వకూడదనే ఉద్దేశంతో ఆ ప్రీమియం డబ్బును కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని సీతక్క చెప్పుకొచ్చారు.


ప్రస్తుతం రాయ్ బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరపున ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న సీతక్క ఈ మేరకు శనివారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో ధాన్యం తడిసి ఆందోళనలో ఉన్న రైతాంగానికి సీతక్క ధైర్యం చెప్పారు. తడిసిన ధాన్యం విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. తడిసిన ప్రతి ధాన్యపు గింజను మద్దతు ధరకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.


ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలిచ్చామని సీతక్క పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వానలకు పలు ప్రాంతాల్లో పంటనష్టం జరిగిందన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తరపున చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు.


మరోవైపు.. రాష్ట్రంలో కురుస్తున్న వర్షం పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి సీతక్క. కాగా.. వానాకాలం సీజన్ నుంచే పంటల బీమాను అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు ఇదివరకే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పంటల బీమా ప్రతిపాదనలను పరిశీలించాలని ఎన్నికల సంఘం అనుమతితో టెండర్ల ప్రక్రియ చేపట్టాలని కూడా సూచించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa