తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పటి వరకు క్యాంపు ఆఫీసు లేదు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని ఆరు నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేసుకోలేదు. గత ప్రభుత్వ హయంలో ప్రగతి భవన్ క్యాంపు ఆఫీసుగా ఉండగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ భవనాన్ని ప్రజాభవన్గా పేరు మార్చి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా మార్చారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఏవైనా సమీక్షలు నిర్వహించాలంటే తన ఇంటి నుంచి లేదా సెక్రటేరియట్ నుంచి చేస్తున్నారు.
అయితే క్యాంపు ఆఫీసు కోసం పలు బిల్డింగ్లు పరిశీలించినా..ఏదీ కార్యరూపం దాల్చలేదు. పైగా ప్యాలెస్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం తదితర బిల్డింగ్లు చూసినా ఆఫీసు ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను క్యాంప్ ఆఫీస్లా వాడుకునేందుకు సీఎం రేవంత్రెడ్డి డిసైడ్ అయ్యారు. రెగ్యులర్ రివ్యూలకు ఈ బిల్డింగ్నే వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ లేకపోవడంతో ఇప్పటికే అన్ని సౌకర్యాలతో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సీఎం ఛాంబర్ను సమీక్ష సమావేశాల కోసం ఉపయోగించుకుంటున్నారు.
ఇక సెక్రటేరియెట్ ఆరో ఫ్లోర్లోని ముఖ్యమంత్రి ఛాంబర్లోనూ మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఉదయం వేళల్లో అధికారులకు ఇబ్బందులు కలగకుండా.. కేవలం రాత్రి వేళల్లో మాత్రమే పనులు జరుగుతున్నట్లు తెలిసింది. అందుకోసమే సీఎం రేవంత్ సచివాలయానికి రావటం లేదని సమాచారం. మాజీ సీఎం కేసీఆర్ కోసం ఏర్పాటు చేసిన ఛాంబర్లో ఎలాంటి మార్పులు చేయకుండానే సీఎం రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే కొందరి వాస్తు నిపుణుల సూచన మేరకు.. ఈస్ట్ ఫేస్లో ఉన్న కుర్చీని.. నార్త్ ఈస్ట్ వైపు మార్చుతున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa