మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళికి తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కట్టెబట్టనున్నట్లు తెలుస్తోంది. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకురావాలని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి..అందుకోసం విద్యాకమిషన్ను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అందులో భాగంగా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళీకి విద్యాకమిషన్ ఛైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. మురళి గతంలో జగన్ హయాంలో ఏపీ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేశారు.
ఏపీలో మన ఊరు–మన బడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంతోపాటు స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆయన విశేషంగా కృషి చేశారు. అక్కడ సర్కార్ స్కూళ్లకు ఆధునిక రూపు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే విద్యారంగంపై అపార అనుభవం ఉన్న ఆకునూరి మురళిని విద్యాకమిషన్ చైర్మన్గా నియమించనున్నట్లు సమాచారం.గతంలో భూపాలపల్లి కలెక్టర్గా పని చేసిన ఆకునూరి మురళి బీఆర్ఎస్ ప్రభుత్వంతో విభేదించారు. ఆ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. అనంతరం అప్పటి ఏపీ ప్రభుత్వం మురళి సేవలను వినియోగించుకుంది. ఆయన్ను సలహాదారుగా నియమించుకున్న అప్పటి సీఎం జగన్ విద్యారంగం బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన పాఠశాలల్లో మౌలిక సదుపాయల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలపైనా స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్.. విద్యా కమిషన్ ఛైర్మన్ పదవి ఆకునూరి మురళికి అప్పగిస్తే సత్ఫలితాలు వస్తాయని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే నియామక ఉత్తర్వులు వెలువడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa