అఖిల భారత సర్వీసెస్లో దివ్యాంగుల కోటాపై సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్స్పై చాలా మంది స్పందిస్తుండగా.. కొంద మంది మద్దతు తెలుపుతుంటే, చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఎంత మంది వ్యతిరేకించినా.. స్మితా సబర్వాల్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. కొందరు సోషల్ మీడియాల్లో తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు ఆమె చేసిన వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇవ్వటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలోనే.. స్మితా సబర్వాల్ ట్వీట్లపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో మీడియాతో చిట్చాట్ చేసిన భట్టి విక్రమార్క.. స్మిత సబర్వాల్ ఓ ఐఏఎస్ మాత్రమేనని.. ఆమె చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఏం సంబంధమని భట్టి ప్రశ్నించారు. సోషల్ మీడియాలో అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని.. స్మితా సబర్వాల్ తన అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశారని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ఎంతో మంది వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. స్మితా సబర్వాల్కు భట్టి విక్రమార్క మద్దతు తెలపటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు.. రుణమాఫీ విషయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు హైదరాబాద్లో కూర్చుని మాట్లాడవద్దని.. క్షేత్రస్థాయిలో రైతులు సంతోషంగా ఉన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తమది ప్రజా ప్రభుత్వం అని.. ప్రతి అంశంలో ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నామన్నారు. విద్యారంగం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని.. డే స్కూల్ కాకుండా సెమీ అండ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు.
ప్రస్తుతమున్న ప్రభుత్వ విద్య కంటే మెరుగైన విద్యను అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో భాగంగా ఒక్కో పాఠశాల కోసం రూ.80 నుంచి 100 కోట్లు ఖర్చు చేయబోతోందని వెల్లడించారు. ఒక్రేజ్, బిర్లా ఓపెన్ స్కూల్స్ మాదిరిగానే.. ప్రభుత్వ పాఠశాలలు రాబోతున్నాయన్నారు. బీఏసీలో బీఆర్ఎస్ నాయకుల పేర్లు మార్చుకున్నారని.. అందుకే సమావేశం ఆలస్యం అయిందని భట్టి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa