గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ - జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి షాక్ తగిలింది. తెలంగాణ హైకోర్టు.. ఆమ్రపాలికి బుధవారం నోటీసులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలితోపాటు తెలంగాణ భూగర్భ గనులు, పర్యావరణ శాఖల ముఖ్యకార్యదర్శులకు కూడా ధర్మాసనం నోటీసులు పంపించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాస ప్రాంతాల్లో బండ రాళ్లను తొలగించేందుకు రాత్రి, పగలు తేడా లేకుండా భారీ పేలుళ్లు జరుపుతున్నారని అందిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గత కొన్ని రోజులుగా జూబ్లీహిల్స్లోని నివాస ప్రాంతాల్లో రాత్రి పూట పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయని.. అక్కడ ఉన్న బండరాళ్లను పేల్చేసి వాటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని.. వార్తా పత్రికల్లో వరుస కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ న్యూస్ పేపర్లను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు జడ్జి జస్టిస్ నగేష్ భీమపాక.. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్కు ఒక లేఖ రాశారు. రాత్రి పగలు అనే తేడానే లేకుండా.. నిత్యం దాదాపు 10 పేలుళ్లు జరిపి.. బండరాళ్లను పగలగొట్టి.. వాటిని తరలిస్తున్నారని ఆ లేఖలో జస్టిస్ నగేష్ భీమపాక పేర్కొన్నారు.
ఇక అర్ధరాత్రి వేళ.. వినిపిస్తున్న భారీ శబ్దాల కారణంగా.. పేలుళ్లు జరిపే ప్రాంతానికి సమీపంగా ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. కనీసం నిద్ర కూడా పోవట్లేదని సీజేకు రాసిన లేఖలో ప్రస్తావించారు. ఇక హైకోర్టు జడ్జి రాసిన ఆ లేఖను ప్రజాప్రయోజన వాజ్యంగా స్వీకరించిన హైకోర్టు.. బుధవారం ఈ పిల్పై విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో రాష్ట్ర భూగర్భ గనులు, పర్యావరణ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు.. హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్లను ప్రతివాదులుగా చేర్చింది. ఈ పేలుళ్లపై వెంటనే వివరణ ఇవ్వాలని ఐఏఎస్ ఆమ్రపాలితో పాటు మిగితా వారికి కూడా తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa