హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. రూంలో బట్టలు ఉతకాలని తీసుకెళ్లి.. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పనిమనిషిపై గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొండాపూర్లో పలు ఇళ్లలో పని చేసే ఓ మహిళ.. రోజూలాగే పనికి వెళ్లి రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో.. ఆటోలో వచ్చిన ముగ్గురు యువకులు తమ గదిలో బట్టలు ఉతకాలని అందుకు గానూ.. 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఓ గంటసేపు కష్టపడితే 500 రూపాయలు వస్తాయి కదా అని ఆలోచించి.. సరే అని వాళ్లతో కలిసి ఆమె వెళ్లింది. గదిలోకి వెళ్లిన తర్వాత.. ఉతకటానికి కొన్ని బట్టలు ఇవ్వటంతో.. ఆమె తన పని ప్రారంభించింది. బట్టలు ఉతుకుతున్న సమయంలోనే.. ఆ మహిళను బంధించి.. దాడికి ఎగబడ్డారు ఆ యువకులు. అరుస్తుండటంతో.. ఆమె నోట్లో బట్టలు కుక్కి.. అత్యాచారానికి పాల్పడ్డారు. వాళ్లపై ప్రతిఘటించిన బాధితురాలిని తీవ్రంగా గాయపరిచారు.
అత్యాచారం అనంతరం ఆ యువకులు బయటకు వెళ్లటం గమనించిన బాధిత మహిళ.. వాళ్ల కంట పడకుండా తప్పించుకుంది. వాళ్ల నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని భావించిన బాధితురాలు.. ఒంటిపై బట్టలు లేకుండానే బయటకు పరుగులు తీసింది. బాధితురాలిని గమనించిన ఓ స్థానిక మహిళ.. పరిస్థితి అర్థం చేసుకుని వెంటనే తన నైటీ ఇచ్చింది. అనంతరం.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించి.. జరిగిన విషయాన్ని వివరించారు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
అత్యాచారానికి పాల్పడిన ఆ ముగ్గురు యువకులు ఉత్తర్ప్రదేశ్ గోరఖ్పూర్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న యువకుల గురించి గాలింపు చర్యలు చేపట్టారు. మహిళను భరోసా కేంద్రానికి తరలించారు.
ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడుల కేసులు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా.. మరెన్ని చట్టాలు తీసుకొచ్చినా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట ఇలాంటి అఘాయిత్యాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa