ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే ఏడాది జనవరి నుంచి సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని వెల్లడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 05, 2024, 09:15 PM

రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది జనవరి నుంచి తెలంగాణవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారందరికీ సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇది దేశ చరిత్రలో ఓ మైలురాయి అన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.దాన్యం సేకరణ కేంద్రాల్లో ఎలాంటి గందరగోళం ఉత్పన్నం కాకుండా... రైతులకు మద్దతివ్వడానికి ప్రజాప్రతినిధులు క్షేత్ర పర్యటనలు నిర్వహించాలన్నారు. సన్న ధాన్యంపై క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వడం చారిత్రాత్మకమన్నారు. ధాన్యం సేకరణను విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులను కోరారు. ఈరోజు సాయంత్రం ఆయన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa