ప్రపంచ ఆంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వారోత్సవాలను (18 నుండి 24 నవంబర్ 2024) పురస్కరించకుని డాక్టర్ జి .అన్న ప్రసన్న కుమారి , పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాలతో జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, ఆయుష్మాన్ భారత్ మందిరములు అనగా సబ్ సెంటర్లలో ఆంటీ మైక్రోబియల్ రిజిస్టన్స్ కార్యక్రమం పై అవగాహనలో భాగంగా అనవసరంగా యాంటీబయాటిక్స్ ఉపయోగించమని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా సంబంధిత మెడికల్ ఆఫీసర్లు మాట్లాడుతూ అనవసరంగా ఆంటీబయాటిక్స్ వాడవద్దని, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆంటీబయాటిక్స్ వాడవద్దని అలా వాడిన యెడల శరీరంలో రెసిస్టెన్స్ వస్తుందని తిరిగి యాంటీబటిక్స్ వాడిన పనిచేయవని అన్నారు.
దేవునిపల్లి జాతర యందు నిర్వహించుచున్న ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ప్రోగ్రాం ఆఫీసర్ల పరిశీలన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ రాజమౌళి, డాక్టర్ వాణిశ్రీ, డాక్టర్ బి కిరణ్ కుమార్ దేవునిపల్లి జాతరలో నిర్వహించుచున్న దేవునిపల్లి జాతరలో నిర్వహించుచున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రజలకు ఆరోగ్య విషయంలో ఇబ్బంది కాకుండా తగిన సూచనలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa