ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: కాంగ్రెస్ ఎంపీ చామల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 26, 2024, 09:14 PM

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు పార్లమెంట్ ఆవరణలో ఆయన మాట్లాడుతూ... బీజేపీకి రాజ్యాంగంపై ఏమాత్రం నమ్మకం లేదని విమర్శించారు. ప్రజల దృష్టిని మరల్చి అధికారంలోకి రావడమే వారికి కావాలని ఆరోపించారు.2000 సంవత్సరంలో వాజపేయి ప్రభుత్వం ఉన్నప్పుడు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో మార్పులు తీసుకు రావడానికి జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. దేశంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూలుస్తూ బీజేపీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోందన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa