గురుకులాలతో పాటు ఇతర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సమస్యలతో అవస్థలు పడుతుంటే పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వారోత్సవాలు జరుపుకుంటుందని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరంపల్లి పరశురాములు అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాల, కేజీబీవీ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని గురుకులంలో 48 మంది విద్యార్థులు చనిపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 300 మంది విద్యార్థులు కలుషిత ఆహారం బారిన పడ్డారని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
విద్యార్థులకు కప్పుకోవడానికి దుప్పట్లు, కాస్మెటిక్ రూపాయలు, బూట్లను అందించడంలో పూర్తిగా విఫలమైందని మండి పడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విద్యకు పెద్దపీట వేసి మెరుగైన వసతులు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దానికి భిన్నంగా అడుగులు వేస్తూ పరోక్షంగా ప్రైవేటు విద్యాసంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుందని అన్నారు. విద్యార్థిని, విద్యార్థులకు కనీసం మెనూ ప్రకారం నాణ్యతమైన భోజనం అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు యాదగిరి రెడ్డి యాదగిరి, రాష్ట్ర నాయకులు సంబారపు నాగరాజు, నియోజకవర్గ ఇన్చార్జ్ పాపాని సురేష్, పిట్ల రాకేష్, గొల్ల నవీన్, వేణు, చందు, సాయి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa