స్వరాష్ట్రం,స్వపరిపాలన,నీళ్ళు, నిధులు,నియామకాలు, ఆత్మగౌరవ నినాదాలతో బలిదశ తెలంగాణ ఉద్యమం ఉర్రూతలూగిందని తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు సందెల సునీల్ కుమార్ అన్నారు. హనుమకొండలోని హరిత హోటల్లో ఏర్పాటు చేసినటువంటి ఉద్యమకారుల సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ముందుగా మలిదశ ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా అమరుడైనటువంటి శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఉద్యమకారుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు సందెల సునీల్ కుమార్ మాట్లాడుతూ సబ్బండ వర్గాలు ఉద్యమంలో పాల్గొన్నాయి.తొలి దశ ఉద్యమంలో 369 మంది అమరులు కాగా, మలిదశ ఉద్యమంలో సుమారు 1300 మంది అమరులయ్యారన్నారు.
2017 వ సంవత్సరంలోనే ఉద్యమకారుల సంఘాన్ని స్థాపించి అనేక కార్యక్రమాలు చేపట్టామని ఆయన అన్నారు. ఉద్యమకారులకు జరుగుతున్నటువంటి అన్యాయాల పైన ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్నామని, దీనికి అందరూ ఉద్యమకారులు కలిసి రావాలని అన్నారు.కొన్ని ఉద్యమ సంఘాలు,ఉద్యమ ఫోరామ్ ల పేరుతో కొత్తగా కొన్ని సంఘాలు పుట్టుకొచ్చి, నిజమైన ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని అన్నారు.మలి దశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులంతా ఒకే వేదిక పైకి కలిసి రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa