ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాకు ఆటలంటే ప్రాణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 04, 2024, 03:35 PM

నాకు ఆటలంటే ప్రాణమని, అందులో నేను క్రికెట్‌ బాగా ఆడతానని  అందోలు–జోగిపేట ఆర్డీఓ పాండు అన్నారు. మంగళవారం    జోగిపేట ప్రైవేట్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ( జోప్స్మా) ఆధ్వర్యంలో జోగిపేటలోని డాన్‌బాస్కో పాఠశాలలో మంగళవారం  క్రీడోత్సవాలను  ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి. జోప్స్మా అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి అధ్యక్షత వహించారు.   1983లో మొదటిసారి ఇండియా వరల్డ్‌ కప్‌ సాధించినప్పటి నుంచి తనకు క్రికెట్‌ ఆటపై మోజు పెరిగిపోయిందన్నారు. తన విద్యాభ్యాసం  నిజాం కళాశాలలో జరిగిందని, ఇప్పటికి కూడా ప్రతి రోజు క్రికెట్‌తో పాటు వాకింగ్, యోగా చేస్తానన్నారు. క్రీడాకారులు విద్యలో కూడా ముందుంటారన్నారు. మనిషికి శరీరధారుడ్యత తప్పనిసరి అన్నారు. మండల విధ్యాధికారి బండి కృష్ణ మాట్లాడుతూ పట్టణంలోని ప్రైవేట్‌ పాఠశాలలన్నీ ఒకే వేదిక మీదకు రావడం, క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం తరపున నిర్వహించే ఎస్‌జీఎఫ్‌ క్రీడల్లో కూడా ప్రైవేట్‌ పాఠశాలలు కూడా భాగస్వాములు కావాలన్నారు. పోటీల్లో గెలుపు ఓటములు సహజమేనన్నారు.
వాలీబాల్‌ పోటీలను ప్రారంభించిన ఆర్డీఓ, ఎంఈఓ జోప్స్మా  ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్‌ పోటీలను ఆర్డీఓ పాండు ప్రారంభించారు. క్రీడోత్సవాల్లో భాగంగా జ్యోతిని వెలిగించి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ పోటీల్లో 8 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జోప్సాS్మ అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి దాసరి నాగేశ్వరరావు, ఉపాధ్యాక్షుడు రుపస్, కోశాధికారి వెంకటేశం, సహయ కార్యదర్శి రామకృష్ణ, డైరెక్టర్‌ ప్రేమ్‌ కుమార్, లయన్స్‌క్లబ్‌ జిల్లా కార్యదర్శి, అందోలు ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు ఆకుల రాంబాబు, ఫిజికల్‌ డైరెక్టర్‌ వీబీ శ్రీనివాస్‌లతో పాటు వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్‌లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa