ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఆవిష్కరణ.. కేసీఆర్‌కు రేవంత్ సర్కార్ ఆహ్వానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 06, 2024, 06:32 PM

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 07తో ఏడాది గడుస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా.. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సంబురాల్లో భాగంగా.. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పుట్టిన రోజును పురస్కరించుకుని డిసెంబర్ 09వ తేదీన ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. అదే రోజున సచివాలయం ప్రాంగణంలో.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.


అయితే.. ఈ కార్యక్రమానికి.. రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి రాష్ట్రంలోని పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందించనున్నారు. అందులో భాగంగా.. మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నాయుకుడు కేసీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం అందించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్‌తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్‌కు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ తరపున అధికార ఆహ్వానం అందించనున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన హైదరాబాద్ ఇంఛార్జి మంత్రిగా ఉన్న తాను ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందించనున్నట్టు స్పష్టం చేశారు పొన్నం ప్రభాకర్.


కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఆహ్వానించేందుకు సమయం ఇవ్వాలని వారివారి వ్యక్తిగత సిబ్బందికి సమాచారం అందించినట్టు పొన్నం ప్రభాకర్ తెలిపారు. వాళ్లు ఇచ్చిన సమయంలో.. తానే స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికలు అందిస్తానని పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటనతో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సంబంధించి కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు అధికారిక ఆహ్వానం అందించనుండగా.. ఈ కార్యక్రమానికి వారు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.


ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా.. సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. కాగా.. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పట్లను సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి మరీ చేపిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ తయారీ కేంద్రానికి తానే స్వయంగా వెళ్లిన పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయం ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేపిస్తున్నారు. ఈ విగ్రహాన్ని సచివాలయ ప్రాగణంలో ఏర్పాటు చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa